నంద్యాల టౌన్: ఐదేళ్ల పదవీ కాలంలో నంద్యాల పట్టణ రూపురేఖలను మార్చేస్తానని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక తొలిసారిగా సోమవారం మునిసిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు కమిషనర్ రామచంద్రారెడ్డి, సిబ్బంది స్వాగతం పలికారు. భూమా మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని, రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తానన్నారు. ఆవులు రోడ్లపైన తిరగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, ప్లాస్టిక్ తిని మృత్యువాత పడుతున్నాయని ప్రతి ఆవును ఎస్బీఐ కాలనీలోని గోశాలకు తరలించాలని శానిటరీ సూపర్వైజర్ జబ్బార్ మియాకు సూచించారు.
క్లీన్ సిటీలో భాగంగా పట్టణంలో 450ఎకరాల ఖాళీ స్థలాల్లో కంపచెట్లు తొలగించినా, యజమానులు స్పందించడం లేదన్నారు. యజమానులు స్థలాల్లో మట్టి వేసుకొని, నీరు నిల్వ ఉండకుండా చదును చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరమైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికపై అదనంగా సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.
తక్షణమే రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లపై బతికే చిల్లర వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపి తర్వాతే రోడ్లను విస్తరించాలన్నారు. పందులను నిర్మూలించడానికి ఏఆర్ కానిస్టేబుళ్లను రప్పించాలని కలెక్టర్ను కోరాలని కమిషనర్కు సూచించారు. కౌన్సిలర్లు శివశంకర్, కొండారెడ్డి, జేవీసీ హారిక, గోరె ముర్తుజా, కృపాకర్, విజయభాస్కర్రెడ్డి, పార్టీ నేతలు వడ్డెశీను, వడ్డెమనోజ్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
నిధుల కోసం ప్రధానిని కలుస్తా: భూమా
నంద్యాల : నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విషయమై ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకపోయినా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో నిధులను రాబట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
పట్టణంలోని పేదలకు 10 వేల ఇళ్ల నిర్మాణాలను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మించి తీరుతామన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి కార్యాచరణ రూపొందిస్తానన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల విషయమై ప్రధానితో పాటు కేంద్రంలో పరిచయం ఉన్న నేతలందరినీ కలుస్తానన్నారు. పందుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని.. ఈ విషయమై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. పట్టణంలో రోడ్లపై తిరుగాడే ఆవులను గోశాలకు తరలించాలని.. వీటి పోషణకు దాతలు సహకరించాలని కోరారు.
నంద్యాల రూపురేఖలు మార్చేస్తా
Published Tue, Jun 10 2014 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement