సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల చట్టంలో సమూల మార్పులు చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తోంది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోంది. యూనివర్సిటీలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వం చట్టంలో మార్పులకు నిర్ణయించింది. ఉన్నత విద్యారంగం విస్తరించి కొత్తగా అనేక కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, అటానమస్ కాలేజీలు ఏర్పాటైనప్పటికీ చట్టంలో మాత్రం ఇంతవరకూ ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పాలనా పరమైన అక్రమాలను నిరోధించడానికి వీలులేకుండాపోతోంది.
స్వతంత్రత పేరిట వర్సిటీల్లో వీసీలు, పాలకమండళ్లదే ఇష్టారాజ్యంగా మారింది. ముఖ్యంగా నియామకాలు, నిధుల ఖర్చు, కాంట్రాక్టులు, కొనుగోళ్లు వంటి విషయాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్సిటీల చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. విక్రమసింహపురి మాజీ వీసీ ప్రొఫెసర్ సీఆర్ విశ్వేశ్వరరావు, ఎస్కే వర్సిటీ రిటైర్డ్ లా ప్రొఫెసర్ టీపీ సుదర్శన్రావు, నాగార్జున వర్సిటీ రిటైర్డ్ లా ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీఎస్ఎన్ రెడ్డి, నాగార్జునవర్సిటీ కంప్యూటర్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.త్రిమూర్తి, రిటైర్డ్ సీనియర్ ఆడిట్ అధికారి పి.సుబ్రహ్మణ్యం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుత చట్టంలోని అంశాలను కూలంకషంగా పరిశీలించి ప్రతికూలాంశాలను గుర్తించడం, ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీల చట్టాలను పరిశీలించి అందులోని మంచి అంశాలు ఇక్కడ అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించడం, ప్రస్తుత సామాజిక అవసరాలకు, సవాళ్లను అధిగమించేందుకు అనుగుణంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దడానికి సూచనలు చేయడం, చివరిగా ముసాయిదా సవరణల చట్టాన్ని రూపొందించడం ఈ బృందం విధి. ఈ కమిటీ ఇప్పటికే ఆరు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఇదిలావుండగా, వర్సిటీలను తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు మాత్రమే ప్రభుత్వం చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
వర్సిటీల చట్టంలో సమూల మార్పులు
Published Mon, May 4 2015 8:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement