విజయనగరం కంటోన్మెంట్: మీకు సౌకర్యాల్లేవంటే ఎలా..? ముఖ్యమంత్రి నేడో రేపో వచ్చేస్తున్నారు. ఇక్కడా అక్కడా అనకుండా మేమిచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకోండి..లేదంటే తీసుకున్న పరిహారాన్ని వెనక్కు ఇచ్చేయండి. ఇవీ తోటపల్లి నిర్వాసితులకు తహశీల్దార్లు జారీచేస్తున్న నోటీసులు. మాకు మీరిచ్చిన స్థలాలు నివాసయోగ్యం కాదు మొర్రో అని మొత్తుకుటుటున్నప్పటికీ అధికారులు వినిపించుకోవడం లేదు. ఆ నోటీసులపై అర్జంట్ అని ముద్రించి మరీ పంపిస్తున్నారు. దీంతో నోటీసులు అందుకున్న నిర్వాసితులు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈనెల 15 తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కనిపిస్తుండడంతో అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.తోటపల్లి ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామాల్లో సహాయ పునరావాసం కింద 21 గ్రామాలను గుర్తించారు.
ఇందులో పది గ్రామాలను తరలించారు. ఇంకా పీఆర్ఎన్ వలస, బాసంగి, సుంకి తదితర గ్రామాల నిర్వాసితులకు భూముల గుర్తింపు, పట్టాల పంపిణీ మిగిలి ఉంది. మొత్తం 4286 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన అధికారులు పట్టాలు తీసుకోని వారికి నోటీసులు ఇస్తున్నారు. నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలు బీపీఎల్కు చెందిన వారైనప్పటికీ చాలా మంది ఏపీఎల్ పరిధిలో ఉన్నారని రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా బీపీఎల్ కిందికే వస్తారు. కానీ రికార్డుల్లో మాత్రం చాలా మందికి ఏపీఎల్ అంటూ నమోదు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవనీ, బాంబులు వేసి క్వారీ రాళ్లు పేల్చే చోట మాకు ఇళ్లు నిర్మించుకోవాలని బలవంతం పెడుతున్నారని మొత్తుకుంటుంటే మా మొర వినిపించుకోకుండా తిరిగి మాకు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికే సుంకి గ్రామంలోని 35 మంది తమకు అనుకూలంగా లేని చోట భూములు ఇచ్చినా తాము వెళ్లేది లేదని పట్టుదలతో ఉండిపోయారు. వారికి ఈనెల 27న నోటీసులు పంపించారు. వీరితో పాటు తులసి రామినాయుడు వలస గ్రామానికి చెందిన వారికి గరుగుబిల్లి తహశీల్దార్ అర్జంటు నోటీసులు ఇచ్చారు. 284 నంబర్తో వచ్చిన ఈ నోటీసులు చూసి అధికారులు ఎక్కడ స్థలం చూపిస్తే అక్కడికే వెళతారని ఊహించిన ప్రభుత్వ యంత్రాంగం తీరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంటి స్థలం పట్టాను తీసుకునేందుకు నిరాకరించుట గురించి అని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో వీఆర్వో ఇచ్చిన పట్టాలను మీరు తీసుకోవడం లేదని మీరు ఏపీఎల్కు చెందిన వారనీ, పట్టా తీసుకోకపోతే గతంలో మీకు ఇచ్చిన పరిహారాన్ని వారం రోజుల్లోగా పార్వతీపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో వాపసు చేయాలని, అతి జరూరు పేరుతో నోటీసులు ఇవ్వడం న్యాయమా? అని నిర్వాసితులు వాపోతున్నారు.
అర్జంట్
Published Mon, Jul 6 2015 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement