కర్నూలు, వెల్దుర్తి: కరోనా వ్యాధి నిర్మూలనకు కోసం పలువురు వైఎస్సార్సీపీ మండల నాయకులు, పలువురు దాతలు ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ.7,30,000 విరాళాన్ని చెక్కుల రూపంలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్రెడ్డికి శుక్రవారం అందించారు. విరాళం అందించిన వారిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సమీర్కుమార్ రెడ్డి, అల్లుగుండు శ్రీరాంరెడ్డి, గుంటుపల్లె మహిందర్ రెడ్డి, రామళ్లకోట రాధాకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
ఆదోని, అర్బన్: కోవిడ్–19 బాధితుల కోసం వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వెల్లాల మధుసూదనశర్మ, నాయకుడు రవికిరణ్ శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.21 వేల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి చెక్కు అందజేశారు.
వెల్దుర్తిలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చెక్కు అందజేస్తున్న డీలర్లు,
చిన్నారుల పెద్ద మనసు
కర్నూలు(సెంట్రల్): కల్లూరు ఎస్టేట్లో నివాసం ఉంటున్న రాజశేఖర్, సరిత దంపతుల కుమారులు సాయిరామ్, బన్నీ తమ హుండీలో దాచుకున్న రూ.3006 నగదును కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు శుక్రవారం విరాళంగా ఇచ్చారు. కర్నూలులోని కృష్ణానగర్ ఎస్బీఐ బ్యాంకు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు నగదును పంపించారు.