సమన్వయ కమిటీ భేటీకి చిరంజీవి డుమ్మా | Sakshi
Sakshi News home page

సమన్వయ కమిటీ భేటీకి చిరంజీవి డుమ్మా

Published Thu, Jan 22 2015 6:51 PM

సమన్వయ కమిటీ భేటీకి చిరంజీవి డుమ్మా - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సాయిప్రతాప్ హాజరుకాలేదు. రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా డుమ్మా కొట్టారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఇందిరాభవన్ లో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించారు. తిరుపతి ఉప ఎన్నిక, చంద్రబాబు పాలన వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement