- టీడీపీ కాంగ్రెస్లలో నిరుత్సాహం
- బాలయ్య సభలు ఫ్లాప్
- తుస్సుమన్న చిరంజీవి రోడ్షోలు
- ప్రచారంలోనూ సైకిల్ వెనుకంజ
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ,కాంగ్రెస్లు ప్రచారంలోనూ ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆయా పార్టీల తరఫున ప్రచారానికి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు బాలకృష్ణ,చిరంజీవి పర్యటనలూ ఫ్లాప్ కావడంతో ఈ పార్టీలు కలవరపడుతున్నాయి. వీళ్ల ప్రచారం ద్వారా కొంచెమైనా లబ్ది పొందాలనుకుంటే చివరకు పరువుకూడా పోతుండడంతో దిగులు చెందుతున్నాయి. ఎన్నికలకు పదిరోజులే మిగిలి ఉండడంతో ప్రచారంలో కూడా పోటీకూడా ఇవ్వలేకపోయామని గుబులుచెందుతున్నాయి.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార రథ సారథి చిరంజీవి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వస్తుండడంతో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులు ఈయనపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. తీరా అట్టర్ఫ్లాప్ కావడంతో కంగుతిన్నారు. మంగళవారం, బుధవారం గాజువాక,చోడవరం,అనకాపల్లి, విశాఖసిటీలో చిరు రోడ్షోలు విఫలమయ్యాయి. కనీసం కార్యకర్తలు కూడా ఈయన వెంట నడవలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు తలలుపట్టుకుంటున్నారు. ఎంతో ఆశించి ఉహించుకున్న స్టార్క్యాంపెయినర్ చిరు జనాన్ని ఆకట్టుకోలేకపోవడంతో తాము చెప్పుకోదగ్గ పోటీకూడా ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు మధనపడుతున్నారు.
టీడీపీ పరిస్థితి మరీ ఘోరం
విశాఖలో విజయమ్మ పర్యటన, లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తుండడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీలో జోష్ రెట్టింపయింది. ఫ్యాన్జోరు హోరెక్కిస్తోంది. ఈ తరుణంలో బాలకృష్ణ పర్యటన ప్రకటించడంతో సంతోషపడ్డారు. ఆయన రాక కొంతవరకైనా పార్టీకి ఊపుతెస్తుందని భావించారు. కానీ ఆయన రావడం ద్వారా ఒరిగే ప్రయోజనం కంటే జరిగిన నష్టమే ఎక్కువని ఇప్పుడు తీరిగ్గా తలబాదుకుంటున్నారు.
ఆయన అర్థంపర్థంలేని ప్రసంగాలు, బహిరంగస భ,రోడ్షోలకు అసలేమాత్రం జనం లేకపోవడంతో వీరంతా నీరుగారిపోయారు. పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలో కనీసం పార్టీ క్యాడర్ జాడలేకపోవడం, వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాలకృష్ణ ప్రసంగిస్తుంటే ఫ్యాన్ఫ్యాన్ అంటూ నినాదాలు చేయడం మింగుడు పడనీయడం లేదు. చివరకు ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిపోయిన టీడీపీకి బాలకృష్ణ అట్టర్ఫ్లాప్ పర్యటన తోడై పార్టీని మరింత అప్రతిష్టపాల్జేసిందని సొంత నేతలే రుసరుసలాడుతున్నారు.