ఇది టీడీపీ మట్టి మాఫియా | Sakshi
Sakshi News home page

ఇది టీడీపీ మట్టి మాఫియా

Published Sun, May 15 2016 1:26 AM

clay Mafia in TDP Leaders

కొత్తపల్లి : టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేల అండతో ఇసుక, మట్టి మాఫియాతో అక్రమాల కు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నియోజక కన్వీనర్ పెండెం దొరబాబు అన్నారు. గోర్స గ్రామం బద్రి చెరువులో నీరు- చెట్టు పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడిక తీత ద్వారా కూలీలకు జీవనాధారం కల్పించేందుకే నీరు-చెట్టు పథక మని అన్నారు.
 
  అయితే ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ తన కుటుంబ సభ్యులతో దోచుకునే కార్యక్రమంగా చేపట్టారన్నారు. నియోజకవర్గంలో సుమారు 25 పొక్లెయిన్లతో రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది లారీలు, ట్రాక్టర్లతో ఇసుక, మట్టి తరలిస్తున్నారని, తవ్వవలసిన లోతుకంటే అధికంగా తవ్వేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఇటీవల కలెక్టరు దృష్టికి తీసుకువెళ్ళినా నీరు-చెట్టు కార్యక్రమం చెరువుల అభివృద్ధి కోసమేనని, అడ్డు చెప్పవద్దని అన్నారన్నారు.
 
 కోట్ల రూపాయలతో మట్టి వ్యాపారం చేస్తూ గ్రామంలో ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు గ్రామస్తులను ఒప్పించి భారీ తరలింపునకు పాల్పడుతున్నారు. దొరబాబు వెంట వైసీపీ నాయకులు గండేపల్లి బాబి, నడిగట్ల చింతలరావు, సీహెచ్ వరప్రసాద్, బొజ్జా నాగేశ్వరరావు,పర్ల రాజా, పచ్చిమళ్ళ అప్పలరాజు, బోను దేవా, పాలిక ప్రవీణ్‌కుమార్, గుర్రం సురేష్,ఆనాల సుదర్శన్, సాకా చిన్నబ్బాయి, పూజ్యం సతీష్‌బాబు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement