ఆడిన మాట తప్పిన ముఖ్యమంత్రి
రుణ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ
అధికారంలోకి వచ్చినా తీరని అప్పులు
కొత్తగా రుణాలు ఇచ్చేది లేదని ఛీకొట్టిన బ్యాంకర్లు
తప్పక వడ్డీవ్యాపారుల గడపతొక్కిన మహిళలు, రైతులు
చివరకు అధిక వడ్డీ కబంధ హస్తాల్లో విలవిల...
కాల్మనీ వ్యాపారుల అకృత్యాలు, దురాగతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూల కారణమని జిల్లాలోని రైతులు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆడిన మాట తప్పి పాపం మూటగట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేసి ఉంటే నేడు ఈ అఘాయిత్యాలకు అవకాశమే ఉండేది కాదని విశ్లేషిస్తున్నారు.
గుంటూరు : కాల్మనీ అనర్థాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా రద్దు చేస్తానని, తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదని బాబు ప్రచారం చేశారు. ఆయనకు తోడు పార్టీ కార్యకర్తలు సైతం ఇంటింటికీ తిరిగి ‘బాబు వస్తే జాబు’తోపాటు రుణాలు రద్దవుతాయని ప్రజలను నమ్మించారు. తీరా, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మాట మార్చారు. షరతులు విధించారు. వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర గడిచినా తీసుకున్న రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు కాకపోగా, వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి.
పాత అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. తప్పని పరిస్థితుల్లో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు కాల్మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అనేక మంది రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ ఆస్తులను పోగొట్టుకున్నారు.
జిల్లాలో 11 లక్షల 47 వేల మంది రైతులు రూ.9,600 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తం మాఫీ అవుతుందని భావించారు. అయితే మాఫీకి సంబంధించి రేషన్కార్డు, ఆధార్కార్డు పట్టాదారు పుస్తకాలు ఉండాలన్నారు. పట్టాదారు పుస్తకాలు లేని రైతులను అనర్హులుగా ప్రకటించారు. మొత్తం రుణం వాయిదాల్లో మాఫీ చేస్తామని, రుణ మాఫీలో ఆలస్యమైనా వడ్డీని తామే చెల్లిస్తామని పాలకులు చెప్పారు. మొదటి దశలో రూ.543 కోట్లు చెల్లించారు. అయితే వడ్డీలు, సర్చార్జీలు కలిపి పెరిగిన రుణంలో ఈ మొత్తం 10 శాతం కూడా లేకపోవడంతో రైతుల రుణ మొత్తాలు తగ్గలేదు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు.
ప్రతీ ఖరీఫ్లో వరి రైతు ఎకరాకు రూ.20 వేల వరకు రుణం తీసుకుంటాడు. ఈ సారి బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రుణాల కోసం రైతులు కాల్మనీ, అధిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీనిని అలుసుగా తీసుకున్న కాల్మనీ వ్యాపారులు ఇళ్లు, ట్రాక్టర్లు, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకుని రైతులకు రుణాలు ఇచ్చారు.
ఒక వైపు పాత అప్పులు కట్టాలని బ్యాంకర్ల ఒత్తిడి, మరో వైపు కాల్మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక కొందరు రైతులు అనారోగ్యంతో మృతి చెందితే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మొత్తం 60 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం బాబుదేనని ఆ రైతు కుటుంబాలు ఘోషిస్తున్నాయి. జిల్లాలో 55 వేల డ్వాక్రా గ్రూపుల్లో ఎక్కువ మంది సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన మాటల గారడీతో బురిడీ కొట్టించారు. వారు తీసుకున్న రూ.450 కోట్లను రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులంతా అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చివరకు ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలను బ్యాంకులో జమ చేశారు. అయితే సభ్యులు వడ్డీలు చెల్లించడం లేదని ఆ రూ.3 వేలను బ్యాంకర్లు లాగేసుకున్నారు. చివరకు మహిళలు కూడా బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదని కాల్మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలో సకాలంలో చెల్లించని అనేక మంది మహిళలపై కాల్మనీ నిర్వాహకులు నియమించిన బౌన్సర్లు దాడులు చేశారు. ఇళ్లల్లో సామాన్లు బయట పడేసిన సంఘటనలు జిల్లాలో లేకపోలేదు. విజయవాడ తరహా సెక్స్రాకెట్ అకృత్యాలు గుంటూరులో బయటపడలేదని, అయితే ఆ తరహా దురాగతాలు లేవని చెప్పలేమని కొందరు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
ఈ పాపం బాబుదే
Published Fri, Dec 18 2015 12:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement