- నేనిచ్చిన పిలుపుతోనే వారంతా ఎదిగారు
- అందుకే వారంతా నాకు రాయల్టీ కట్టాలని చెప్పా
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
సాక్షి, అమరావతి: అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తన వల్లే ఆ స్థాయికి ఎదిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వృత్తి నిపుణులుగా ఎదిగిన తెలుగువాళ్లు అంతటితో ఆగకుండా పారిశ్రామికవేత్తలుగా మారాలని తాను ఇచ్చిన పిలుపుతోనే జూయిష్ జాతి మాదిరిగా తయారయ్యారని తెలిపారు. అందుకే వారు సంపాదించే డబ్బులో తనకూ వాటా కూడా ఉందని, రాయల్టీ చెల్లించాలని చెప్పినట్లు వ్యాఖ్యానించారు. శనివారం వెలగపూడి సచివాలయంలో మీడియాకు చంద్రబాబు అమెరికా పర్యటన విశేషాలను వివరించారు. అమెరికాలోని యూనివర్సిటీలు తనకు పీహెచ్డీలు ఇస్తానన్నా వద్దన్నానని తెలిపారు.
యూఎస్ఐ బీసీ తనకు ఇచ్చేందుకే ప్రత్యేకంగా ఒక అవార్డును సృష్టించి మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ సీఎం అవార్డు ఇచ్చిందన్నారు. తన పర్యటనలో రెండు కీలక అంశా లున్నాయని అందులో ఒకటి సోలార్ విద్యుత్ నిల్వకు దోహదం చేసే ప్రాజెక్టు కాగా, కర్నూలులో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు అయోవా యూనివర్సిటీతో చేసుకున్న ఒప్పందం రెండోదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ కర్నూలులో ఉందన్నారు. సోలార్ విద్యుత్ను నిల్వ చేసే కొత్తప్రయోగానికి అమెరికాలోని టెస్లా కంపెనీ శ్రీకారం చుట్టిందని, అందుకే దానితో రాష్ట్రంలోని రెండు చోట్ల ఎనిమిది మెగావాట్ల ప్లాంట్లను ప్రయోగాత్మకంగా పెట్టాలని కోరినట్లు తెలిపారు.
అంతా బాగా జరిగితే పవర్ గ్రిడ్లు మూసేస్తామన్నారు. హైడల్ విద్యుత్ ప్లాంట్లు కూడా వద్దనుకుం టున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా వెయ్యి మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణాన్నీ నిలిపివేయాలని భావి స్తున్నట్లు తెలిపారు. కర్నూలులో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు అయోవా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఈ పర్యటనలో వివిధ కంపెనీలతో 28 ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
నావల్లే ప్రవాసాంధ్రులు పారిశ్రామికవేత్తలయ్యారు
Published Sun, May 14 2017 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement