Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన

Published Wed, May 18 2016 8:35 AM

తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన - Sakshi

 సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం, కొత్తపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంట లకు రాజమహేంద్రవరం చేరుకోనున్న ఆయన రూరల్ పరిధిలోని బోమ్యూరు సెంటర్‌లో గిరిజన యువత ఉపాధి శిక్షణ కోసం రూ.4.50 కోట్లతో నిర్మించిన వైటీసీని ప్రారంభిస్తారు. అక్కడే  కోరమండల్ ఫెర్టిలైజర్స్..రైతుల కోసం ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను, స్వయం సహాయక గ్రూపులు తయారు చేసిన నోట్స్‌బుక్స్ ప్రారంభిస్తారు.
 
 ఆ తర్వాత సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ స్కూల్ ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడతారు. అక్కడ నుంచి 11:10గంటలకు నగరంలోని మునిసిపల్ స్టేడియం వద్దకు చేరుకుని నాగుల చెరువు మార్కెట్ అభివృద్ధి, దానవాయిపేటలో నిర్మించే వ్యాపార సముదాయానికి, సారంగధరమెట్ట వద్ద నిర్మించే తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. నగరపాలక సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తారు. 11:30 గంటలకు చెరుకూరి కల్యాణ మండపంలో నీరు-చెట్టు ప్రగతిపై సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్తపల్లి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొని రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడతారు.
 

Advertisement

What’s your opinion

Advertisement