ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఆ లేఖను ఆమె మీద విసిరేసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదే కాదని, రాజకీయ సంక్షోభం వచ్చేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సిఎన్ఎన్-ఐబిఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాష్ట్రానికి తదుపరి కాబోయే రాజు జగన్మోహన రెడ్డి అని సర్వేలన్నీ చెబుతున్నాయని సిఎన్ఎన్-ఐబిఎన్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాజ్దీప్ సర్దేశాయ్ అన్నారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని, తాము నిర్వహించిన సర్వేలో ఆ పార్టీకి 20కి పైగా ఎంపి స్థానాలు వస్తాయని తేలిందని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఈ దిగువ ఇస్తున్నాం.
రాజ్దీప్ : జగన్ మీరూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంతా ఢిల్లీకి వచ్చారు. అంతా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే వచ్చామని అంటున్నారు. మీరే మంటారు ?
జగన్ : చంద్రబాబు నాయుడు ఎందుకు ఢిల్లీకి వచ్చారో మీకు తెలుసా? సమైక్యాంధ్ర కోసం వచ్చానని బాబు ఎక్కడా చెప్పడం లేదు.
రాజ్దీప్ దేశాయ్: అంటే చంద్రబాబు సమైక్యాంధ్రను కోరుకోవడం లేదని అంటారా ?
జగన్: సమైక్యాంధ్రకావాలని ఆయన ఎక్కడా అనడం లేదు. జై సమైక్యాంధ్ర అని చంద్రబాబుతో ఆనిపించండి చూద్దాం.
రాజ్దీప్: మరి సీఎం కిరణ్ హైకమాండ్ను ఎదురిస్తూ ధర్నాకు దిగుతున్నారు. తెలంగాణ బిల్లును తిరస్కరించాలని రాష్ట్రపతిని కూడా కలవబోతున్నారు. మరి ఆయన కూడా సమైక్యాంధ్రకు కట్టుబడి లేరా?
జగన్ : ఎన్నికల షెడ్యూల్కు మూడు వారాల ముందు అయినా సీఎంకు జ్ఞానం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. జులై 30న సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు రాజీనామా చేసి ఆ లేఖను సోనియా మీద విసిరేసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదే కాదు. రాజకీయ సంక్షోభం వచ్చేది. కాని సీఎం అలా చేయకుండా ఢిల్లీ పెద్దల సూచనలతో ఏపీఎన్జీవోల సమ్మెకు తూట్లు పొడిచారు. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోంది. మా రాష్ట్రానికి పట్టిన దుస్థితికి మానవ తప్పిదమే కారణం. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు.
రాజ్దీప్ : మా ఒపీనియన్ పోల్స్ ప్రకారం మీకు వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 ఎంపీ సీట్లు రావచ్చు. మరి మీ మద్ధతు ఎవరికి ?
జగన్ : సమైక్యమే మా ఎజెండా, ఇంకో మాట లేదు. మా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఎవరు సమైక్యానికి జై కొడితే మా మద్ధతు వారికే .
రాజీనామా లేఖ సోనియా మీద విసిరేసి ఉంటే...
Published Wed, Feb 5 2014 4:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement