పండుగ వేళ మరింత పెరిగిన చలి తీవ్రత
పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలిగాలుల ఉధృతి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ చలి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీనికితోడు చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకే ఆరంభమవుతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని నర్సీపట్నం, పాడేరు, సీతంపేట తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు కప్పేస్తోంది. బాగా ఎండ వచ్చేవరకూ రహదారులు కూడా కనిపించట్లేదు. విశాఖ జిల్లాలోని లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలకు పడిపోవడంతో అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి తట్టుకోలేక వృద్ధులు చనిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వెళ్లిన భక్తులు చలికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
బుధవారం అనంతపురంలో 12.5, కర్నూలులో 14.6, తిరుపతిలో 16.4, కళింగపట్నంలో 15.4, నెల్లూరులో 18.8, కాకినాడలో 17.6, విజయవాడలో 16.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్లో 11.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది.
తెలంగాణలో 17 మంది బలి
చలి తీవ్రతకు తెలంగాణలో గత 24 గంటల్లో ఏకంగా 17 మంది బలయ్యారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మరణించారు. వృద్ధులు, అనాథలు, రోడ్లపైన నిద్రించేవారు ఎక్కువగా చలి బారిన పడి మృతి చెందుతున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, ఏటూరునాగారం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అల్లాడిపోతున్నారు.
వణికిస్త్తున్న చలి
Published Thu, Jan 15 2015 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement