కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

Published Wed, Jun 21 2017 2:02 AM

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం - Sakshi

సాక్షి, అమరావతి: వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ నుంచి ప్రాజెక్టుల పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లున్నాయి. ఈ కేంద్రానికి అనుబంధంగా వివిధ జిల్లాల్లో పది కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కేంద్రాలున్నాయి.

త్వరలో ఏర్పాటయ్యే స్టేట్‌ కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కార్యాలయం(ఇంటిగ్రేటెడ్‌ డేటా బేస్‌ ఫర్‌ రియల్‌ గవర్నెన్స్‌) కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది.
 

Advertisement
Advertisement