కడియం : అకారణంగా తనను పోలీస్స్టేషన్లో నిర్బంధించారని ఆరోపిస్తూ మండలంలోని దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లే వీర్రాజు పోలీస్స్టేషన్ వద్ద ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు వీర్రాజు, అతడి భార్య నవామణిల కథనం ప్రకారం... కడియపులంక సర్పంచ్ వారా పాపారాము వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న వీర్రాజు శనివారం రాత్రి 1.30 గంటల సమయంలో డ్యూటీ చేసి ఇంటికి వెళుతూ కడియం వంతెనపై టిఫిన్ చేసేందుకు ఆగాడు. అయితే అప్పటికే హోటళ్లు మూసివేయడంతో కొద్దిసేపు అక్కడే నిల్చున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కానిస్టేబుళ్లు ఎవరు నువ్వు? ఇక్కడున్నావేంటి? అని అతడిని ప్రశ్నించారు. పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. అతడి వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కుని తెల్లవార్లూ స్టేషన్లోనే ఉంచారు. ఆదివారం ఉదయం ఇంటికి పంపించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వీర్రాజు తన భార్య, కుమారుడితో ఆదివారం స్టేషన్ వద్దకు వచ్చి ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో పోలీసులు అప్రమత్తమై అతడి వద్ద నుంచి అగ్గిపెట్టె లాక్కొని నీళ్లు చల్లారు.
పోలీసులు దురుసుగా ప్రవర్తించారు...
ఈ సందర్భంగా వీర్రాజు, నవామణి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... తాను పోలీస్స్టేషన్లో ఉన్నాననే విషయాన్ని కనీసం తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వీర్రాజు కన్నీటిపర్యంతమవుతూ ఆరోపించారు. తక్షణం సంబంధిత పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వీర్రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు దళితనాయకులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. డీఎస్ఏపీఎస్ అధ్యక్షుడు చింతపర్తి రాంబాబు, నాయకులు విప్పర్తి ఫణి, దమ్ము కృష్ణంరాజు, ధోనిపాటి వందనం, కనికెళ్ల బుల్లియ్య, బొచ్చే ఏసురాజు స్టేషన్కు చేరుకుని వీర్రాజును వారించారు. సంబంధిత సిబ్బందిని తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై టి. నరేష్ హామీ ఇవ్వడంతో వీర్రాజును తీసుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అడ్రస్ చెప్పకే తీసుకొచ్చారు..
సంఘటనపై ఎస్సై టి. నరేష్ మాట్లాడుతూ వంతెనపై ఉన్న వీర్రాజు సరైన సమాధానం చెప్పకపోవడంతో తమ కానిస్టేబుళ్లు చిట్టిబాబు, సుబ్రహ్మణ్యం అతడిని స్టేషన్కు తీసుకొచ్చారన్నారు. అతడి చిరునామాను పరిశీలించి ఉదయాన్నే స్టేషన్ నుంచి పంపేశామని పేర్కొన్నారు. అయితే వీర్రాజు ఆరోపణల నేపథ్యంలో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు.
పోలీసు స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం
Published Mon, Aug 11 2014 12:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement