దేవుడికీ తప్పని కంప్యూటర్ సర్వర్ల సమస్య! | Sakshi
Sakshi News home page

దేవుడికీ తప్పని కంప్యూటర్ సర్వర్ల సమస్య!

Published Sun, Nov 2 2014 12:08 PM

దేవుడికీ తప్పని కంప్యూటర్ సర్వర్ల సమస్య! - Sakshi

తిరుపతి: తిరుమలలో శ్రీవారికి కూడా కంప్యూటర్ సర్వర్ల సమస్య తప్పలేదు. సర్వర్లు మొరాయించడంతో శ్రీవెంటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులు నానా అవస్తలు పడుతున్నారు. సర్వర్లు డౌన్ కావడంతో భక్తులకు గదుల కేటాయింపు ఆగిపోయింది. గదుల కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు.

భక్తులు ఖాళీ చేసిన గదులను  ఇతర భక్తులకు కేటాయించడం సాధ్యంకావడంలేదు. గదుల కేటాయింపు మాన్యువల్గా చేయడానికి టిటిడి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరో రెండు గంటల వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుందని టిటిడి కంప్యూటర్ సిబ్బంది తెలిపారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement