- సింథటిక్ కార్మికులపై పోలీసుల దాష్టీకం
- యాజమాన్యం కొమ్ము కాసిన పోలీస్శాఖ
- బైండోవర్ కేసులు బనాయించి విడిచిపెట్టిన వైనం
- ఆందోళనలో కార్మిక కుటుంబాలు
రాజాం రూరల్: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని అంతకాపల్లి పంచాయతీ సమీపంలో ఉన్న సింథటిక్ కర్మాగార యాజమాన్యం పోలీసులతో కుమ్మక్కై కార్మికులపై అమానుషంగా ప్రవర్తించింది. కర్మాగార అక్రమ లే-ఆఫ్కు నిరసగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు దిగివచ్చినట్టు నటించిన యాజమాన్యం పోలీసులను రాయబారిగా పెట్టి సెటిల్మెంట్ చేస్తామని పిలిపించి అరెస్టు చేయించింది.
పోలీసులు సైతం యాజమాన్యానికి కొమ్ముకాసి కార్మికులపై నిర్దయగా వ్యవహరించారు. వివరాలివీ.. సింథటిక్ కర్మాగారం నష్టాల్లో నడుస్తోందని చెప్పి యాజమాన్యం ఈ ఏడాది ఆగస్టు 8న అకస్మాత్తుగా లేఆఫ్ ప్రకటించింది. దీంతో సుమారు 150 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆందోళన చేపట్టగా నెలలో సగం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ లేఆఫ్ జీతాలు చెల్లించి తర్వాత నెలల జీతాలు చెల్లించకుండా చేతులెత్తేసింది. దీంతో కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు.
అనంతరం స్పందించిన యాజమాన్యం కార్మికులకు పూర్తిగా సెటిల్మెంట్ చేస్తామని ఈ నెల 9న పిలిపించినా, ఎంతోకొంత పెట్టి పంపించేసే ధోరణిలో పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడారు. దీనిని వ్యతిరేకించిన కార్మికులు వెంటనే కర్మాగార సిబ్బందిని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఇన్చార్జ్ సీఐ తమ్మినేని సీతారాం రంగప్రవేశం చేసి యాజమాన్యంతో మాట్లాడి రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు వెనుదిరిగారు. అయితే శుక్రవారం మరోమారు చర్చలు జరుపుకుందాం రమ్మంటూ కార్మికులను యాజమాన్యం పిలిచింది. అంతకు ముందే పోలీసులను ఆశ్రయించి కార్మగారం చుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకుంది.
సుమారు 10 మంది పోలీసులు ఉదయం 7 గంటలకే సంఘటన స్థలానికి చేరుకున్నారు. యథావిధిగా 10 గంటలకు వచ్చిన కార్మికులు శాంతియుతంగా ధర్నా కొనసాగించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవ్వడంతో సీఐ సీతారాం తన సిబ్బందితో వచ్చి కార్మికులందరినీ అరెస్టు చేశారు. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎలా అంటూ నిలదీశారు. తక్షణమే యాజమాన్యం దిగి వచ్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే పోలీస్ స్టేషన్లోనే నిర శన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు పాలకొండ డీఎస్పీని సంప్రదించారు. ఆయన ఆదేశాల మేరకు కార్మికులందరిపైనా బైండోవర్ కేసులు నమోదు చేసి పూచీకత్తులపై విడిచిపెట్టారు.
చర్చలకు పిలిచి అరెస్టులా?
Published Sat, Dec 13 2014 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement