'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం' | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం'

Published Wed, Feb 19 2014 1:40 PM

'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం' - Sakshi

హైదరాబాద్: విభజన విషయంలో విపరీతమైన డ్రామాలు ఆడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయామని అన్నారు. రెండు ప్రాంతాలకు కేంద్రం ఎందుకు న్యాయం చేయదని ప్రశ్నించారు. ఏమీ చేయని సీఎం కిరణ్ ఈ రోజు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసే సమయంలోనూ సోనియాను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. టెన్ జనపథ్ రాసిన స్క్రిప్ట్ను ఇక్కడ అమలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏ రూల్ ప్రకారం హైదరాబాద్ శాంతి భద్రతలు గవర్నర్కు అప్పగించారని చంద్రబాబు ప్రశ్నించారు. లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.అన్ని తెలిసి కూడా విచారణ పేరుతో స్పీకర్ ఎందుకు డ్రామాలాడుతున్నారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement