ఖమ్మం అర్బన్, న్యూస్లైన్: తెలంగాణ బిడ్డల బలవన్మరణాలకు కాంగ్రెస్ పార్టీ తీరే కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నగరంలోని టేకులపల్లికి చెందిన వెంపట రామకృష్ణ కుటుంబీకులను ఆయన గురువారం పరామర్శించారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాదేమోనన్న ఆందోళనతో ఈ నెల 12న సాయంత్రం టేకులపల్లి సమీపంలోని సాగర్ కాలువలో రామకృష్ణ దూకిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆయన మృతదేహం గురువారం కొణిజర్ల మండలంలోని రామనర్సయ్య నగర్ సమీపంలోగల సాగర్ కాల్వలో కనిపించింది.
రామకృష్ణ కుటుంబీకులు, స్థానికులనుద్దేశించి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట ఆడుతోందని, ఈ కారణంగానే రామకృష్ణ వంటి యువకులు రాష్ట్రం ఏర్పాటు కాదేమోనన్న ఆందోళన, ఆవేదనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా ఒకవైపు సీడబ్ల్యూసీలో తీర్మానం చేసి, దానికి వ్యతిరేకంగా మరోవైపు సీమాంధ్రలో ఉద్యమానికి తెర లేపిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన పాపం కాంగ్రెసుదేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధనకు సంఘటిత ఉధృతోద్యమమే మార్గమన్న విషయాన్ని యువత గమనంలో ఉంచుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. రామకృష్ణ కుటుంబీకులను పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంగల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కొర్లకుంట గోవర్ధన్, కార్యదర్శి నంద్యాల శ్రీను, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోయినేని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు
‘తెలంగాణ’ బలవన్మరణాలకు కాంగ్రెస్సే కారణం
Published Fri, Aug 16 2013 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement