నెల్లూరు:కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లును చూసిన తరువాతే మద్దతు తెలుపుతామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టి.బిల్లు అస్పష్టంగా ఉందని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తుది బిల్లును తమ పార్టీ చూసిన తరువాతే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని వెంకయ్య విమర్శించారు. టీడీపీ పొత్తుపై ఎటువంటి చర్చలు జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం, స్వభావాన్ని చూసిన తరువాతే తమ వైఖరి చెబుతామని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మొదట్నుంచి చెబుతూ వస్తుంది.‘తెలంగాణకు, సీమాంధ్రకు న్యాయం జరగాలి. అది మాటలతో కాదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగినట్టు బిల్లులో కనిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.