కాంగ్రెస్‌కు ఓట్లడిగితే జనం కొడతారు.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓట్లడిగితే జనం కొడతారు..

Published Thu, Mar 6 2014 1:47 AM

congress party don't have right to ask vote to people

పలాస రూరల్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అడిగితే ప్రజలు కొడతారని ఆ పార్టీ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ముందు వాపోయారు. మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బుధవారం కాశీబుగ్గలోని హనుమంతు వెంకటరావు, మారూ. ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర ఇళ్లలో వేర్వేరుగా కేంద్ర మంత్రి కృపారాణి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. వెంకటరావు ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ప్రజలు ఆగ్రహం తో ఉన్నారని, ఈ తరుణం లో వారి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో కంగుతిన్న కృపారాణి విలేకరులతో మాట్లాడుతూ ఫొటో తీసుకుని వెళ్లిపోవాలని కోరారు. తాము, కార్యకర్తలు చర్చించుకుంటామని చెప్పారు.
 
 అనంతరం అప్పయ్యదొర నివాసంలో నిర్వహించిన సమావేశానికి మారూ. ఎంపీ కణితి విశ్వనాథం హాజరయ్యారు. మీరు చెప్పిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని కృపారాణి చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో కోట్ని దుర్గాప్రసాద్, దువ్వాడ రూ.వితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, మారూ. కౌన్సిలర్లు మల్లా భాస్కరరావు, రోణింకి శాంతికుమారి, తమ్మినాన శాంతరావు, పైల చక్రధర్, గోళ్ల చంద్రరావు, అట్టాడ మాధవరావు, కర్రి మాధవరావు, మల్లా కృష్ణారావు, రేగి గవరయ్య తదితరులు  పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement