రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన

Published Sun, Dec 15 2013 1:56 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన - Sakshi

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆ   పార్టీకి అధికారమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అందుకోసం ఎవరు పిలిస్తే వారితో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమని ధర్మాన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీనే వద్దని పార్టీ కార్యకర్తలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా అనే అంశంపై మాజీ మంత్రి ధర్మాన శ్రీకాకుళంలో ఆదివారం జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్బంగా తమకు కాంగ్రెస్ పార్టీ అక్కరలేదని ఆ పార్టీ కార్యకర్తలే ధర్మాన వద్ద తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ధర్మాన ఏర్పాటు చేసిన సమావేశానికి శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement