సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ శ్రేణులు వెనకడుగు వేస్తున్నారు. ఎన్నికల వ్యయం పూర్తిగా భరిస్తాం పోటీచేయండని చెబుతున్నా పారిపోయే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ చతికిలపడింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆ పార్టీని జిల్లాలో దాదాపు ఖాళీ చేసింది. కాంగ్రెస్ పేరు వింటేనే ప్రజలు కన్నెర్ర చేస్తోండటమే అందుకు కారణం. ప్రజాగ్రహం వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్పై మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఏ ఒక్కరూ సాహసించడం లేదు.
జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతో పాటు 11 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు వెతుకులాడుతున్నారు. ‘టికెట్ ఇస్తాం.. ఎన్నికల ఖర్చులను భరిస్తాం.. పోటీచేయండి చాలు’ అంటూ ద్వితీయశ్రేణి నేతలను కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడుతున్నా ఏ ఒక్క నేతా ఆ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. అనంతపురం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో ఒక్క డివిజన్లో కూడా కాంగ్రెస్ టికెట్పై పోటీచేస్తానని ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడమే అందుకు నిదర్శనం. మారూ. మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నగర పంచాయతీలోనూ.. ఆయన సొంత నియోజకవర్గ కేంద్రమైన మడకశిర నగర పంచాయతీలోనూ ఏ ఒక్కరూ కాంగ్రెస్ టికెట్పై పోటీచేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
ఇదే అంశాన్ని ఇటీవల హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు బొత్స నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో వై.శివరామిరెడ్డి స్పష్టీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో పోటీ చేయించకపోతే కేడర్ మొత్తం చెల్లాచెదురవుతుందని ఆ పార్టీ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇది సార్వత్రిక ఎన్నికల్లో తమను మరింత ఇరకాటంలోకి నెడుతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేడర్ను కాపాడుకునేందుకు ‘స్వతంత్ర’ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ శ్రేణులకూ సూచిస్తూ.. ఎన్నికల ఖర్చులకు కాస్తోకూస్తో నిధులను కూడా అందిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న గుంతకల్లు, కళ్యాణదుర్గం, మడకశిర మున్సిపాల్టీల్లో ఈ ఎత్తును అమలుచేస్తున్నారు. తాము స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా.. ప్రచారం కోసం తమ వద్దకు రావద్దని ఆ అగ్రనేతలకు కాంగ్రెస్ చోటా నేతలు షరతు పెడుతుండటం కొసమెరుపు.
పరారే.. పరారే!
Published Sat, Mar 8 2014 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement