రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఏ పనీ చేయదు: బొత్స | Sakshi
Sakshi News home page

రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఏ పనీ చేయదు: బొత్స

Published Sun, Sep 29 2013 2:32 AM

రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఏ పనీ చేయదు: బొత్స - Sakshi

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరోక్షంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ రాజకీయ కోణంలో ఏ ఒక్క పనీ చేయదన్నారు. గాంధీభవన్‌లో శనివారం జరిగిన పీసీసీ ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తప్పు జరిగిందని తేలితే వేలెత్తి చూపే అవకాశం ఒక్క కాంగ్రెస్‌లోనే ఉందంటూ.. రాహుల్ కళంకితుల ఆర్డినెన్స్‌పై చేసిన వ్యాఖ్యలు తమకు స్ఫూర్తిదాయకమన్నారు. మాదాసు గంగాధర్, వై.శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కామారెడ్డికి చెందిన పలువురు టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు బొత్స, షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు.

Advertisement
Advertisement