కేసీఆర్ను టార్గెట్ చేసిన కాంగ్రెస్! | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను టార్గెట్ చేసిన కాంగ్రెస్!

Published Tue, Mar 4 2014 11:42 AM

congress targets trs!

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం వస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి.. ఆ మాటను వెనక్కు తీసుకున్నకేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో టీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ విలీనం గురించి కాంగ్రెస్ పెద్దలతో చర్చలే జరపలేదని చెప్పిన కేసీఆర్ .. విలీనం, పొత్తు రెండు ఉండవంటూ టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టీ.జేఏసీపై దృష్టి సారించింది. తమ పార్టీతో తెలంగాణ జేఏసీ ని కలుపుకుని ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్త్తోంది. ఎప్పుడూ తమ మాట వినని వారిని ఏదో రకంగా దారికి తెచ్చుకోవాలని భావించే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదే పనిలో పడింది.  టీ.జేఏసీకి టికెట్ల ఎరవేసి టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని యోచిస్తోంది.

 

కాంగ్రెస్ లో టీఆర్ఎస్ పార్టీ విలీనం కాకపోయినా, పొత్తు అయినా పెట్టుకుంటుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తో చర్చలు జరిపినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఒంటరి పోరుకే మొగ్గు చూపింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ను కాపాడుకోవడం అనేది టి.కాంగ్రెస్ నేతల ముందున్న సవాల్. టీ.జేఏసీని కలుపుకోవడానికి కాంగ్రెస్ చేపట్టిన చర్యలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

 

Advertisement
Advertisement