గండేడ్/కుల్కచర్ల, న్యూస్లైన్: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ను సిమెంట్లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బైకును లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మహమ్మదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐలు జానకీరాంరెడ్డి, కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ దాస్యానాయక్ తండాకు చెందిన నేనావత్ బాస్నాయక్ (27)కు గత 2010లో కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తాండూరులో పనిచేసిన ఆయన ఇటీవల మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ అయ్యాడు.
విధుల్లో భాగంగా శనివారం బోసునాయక్ ఓ కేసు విచారణ కు మండల పరిధిలోని సల్కర్పేట్ గ్రామానికి బైకుపై వెళ్లి తిరిగి ఠాణాకు ప్రయాణమయ్యాడు. తాండూరు నుంచి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ (ఏపీ04వై 7786) రెడ్డిపల్లి సమీపంలో గురుకుల పాఠశాల దగ్గర బాస్నాయక్ బైకును వెనుక నుంచి ఢీకొంది. తలకు తీవ్రంగా గాయాలైన ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో మొకర్లాబాద్ సమీపంలో పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్ను పట్టుకున్నారు. బాస్నాయక్ మృతితో మహమ్మదాబాద్ ఠాణా సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబీకులు ఘనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు.
దాస్యానాయక్ తండాలో విషాదం
దాస్యానాయక్ తండాకు చెందిన దుగ్యానాయక్, మున్నమ్మ దంపతుల రెండో కుమారుడు బాస్నాయక్. మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ ఆయిన నుంచి ఆయన నిత్యం స్వగ్రామం నుంచి ఠాణాకు రాకపోకలు సాగిస్తున్నాడు. బాస్నాయక్ మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం మేకగూడకు చెందిన జ్యోతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి నెల రోజుల క్రితం ఓ కుమారుడు పుట్టాడు.
బాస్నాయక్ తండ్రి ఐదు నెలల క్రితం పంటకు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం బాస్నాయక్ పెద్ద అన్న కిషన్నాయక్ అదృశ్యమై తిరిగి రాలేదు. కానిస్టేబుల్ దుర్మరణంతో భార్య జ్యోతి, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. కానిస్టేబుల్ మృతితో దాస్యానాయక్ తండాలో విషాదం అలుముకుంది.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
Published Sun, Jan 26 2014 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలు.. ప్రభుత్వ ఉద్యోగిపై కేసు
వడ్డెరల మద్దతు వైఎస్సార్ సీపీకే
No Headline
చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు
ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి
సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీకే సాధ్యం
బాలినేనికి బ్రహ్మరథం
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement