గుంటూరుక్రైం
ఏళ్ల తరబడి ఒకే పోలీస్స్టేషన్లో, లేదా ఒకే సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న వారిని త్వరలో బదిలీ చేయడంపై రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో సుమారు 1500 మందికి పైగా కానిస్టేబుళ్లున్నారు. వీరిలో మూడు నుంచి ఎనిమిదేళ్లకు పైగా ఒకే పోలీస్స్టేషన్లో, ఒకే సర్కిల్లో ఉన్న స్టేషన్లలో పనిచే స్తున్నారు. ఏళ్ల తరబడి అక్కడే తిష్టవేసుకుని ఉండటంతో ఆయా స్టేషన్ల పరిధిలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఏస్పీ జె.సత్యనారాయణ కొందరు కానిస్టేబుళ్లను బదిలీ చేసేందుకు యత్నించారు. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుల కారణంగా చూసీ చూడనట్లు వ్యవహరించాల్సి వచ్చింది.
ఎస్ఐ, సీఐలపైనా ఆ సిబ్బంది ప్రభావం
ఈ ఏడాది జూలైలో ఎస్పీగా విధుల్లో చేరిన రామకృష్ణ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే వారి పనితీరుపై దృష్టి సారించారు. ఏళ్ల తరబడి స్టేషన్లలో పాతుకుపోయిన సిబ్బంది కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. వీరి ప్రభావం ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులపైనా పడుతోందని గ్రహించారు. శాఖాపరమైన నిబంధనల మేరకు మూడేళ్లు నిండిన కానిస్టేబుళ్లను బదిలీ చేయాల్సి ఉంది. దీంతో ఆయా కానిస్టేబుళ్ల పనితీరు, ఎక్కడ ఎవరు ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారనే అంశాలపై తన కార్యాలయ ఉద్యోగుల ద్వారా వివరాలు సేకరించి పరిశీలించి, బదిలీలకు శ్రీకారం చుట్టారు.
మరో సబ్ డివిజన్కు..
ఎస్పీ ఆదేశాల మేరకు కార్యాలయ ఉద్యోగులు మూడేళ్లుగా ఒకే సర్కిల్, పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న వారి జాబితాలను సబ్ డివిజన్లవారీగా రూపొందించారు. సుమారు 500 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరు పనిచేస్తున్న సబ్ డివిజన్ పరిధిలో కాకుండా మరో సబ్ డివిజన్కు బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
జాబితాను ఎస్పీ పరిశీలించడమే
ఆలస్యం.:
బదిలీలు చేసినా సిబ్బంది కొరత లేకుండా ఉండేలా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జాబితాను ఎస్పీ పరిశీలించాక ఆయా సిబ్బందిని పిలిపించి మూడు ఆప్షన్ల విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేసేలా ఎస్పీ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.
సిబ్బందిలో ఆందోళన
అర్బన్, రూరల్ జిల్లాల సిబ్బంది విభజన జరిగే వరకూ తమకు బదిలీలుండవని భావించిన సిబ్బందిలో ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 87 మంది ఏఎస్ఐలు, 126 మంది హెడ్ కానిస్టేబుళ్లను ఎస్పీ కౌన్సిలింగ్ విధానంలో బదిలీ చేశారు. మళ్లీ బదిలీల ప్రక్రియను కానిస్టేబుళ్లకు ప్రారంభించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే కుటుంబపరంగా, విధుల పరంగా సమస్యలు ఎదుర్కోక తప్పదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం వేల రూపాయల ఫీజులు చెల్లించామని, ఇప్పుడు బదిలీచేస్తే ఎలాగని మదనపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలనా సౌలభ్యం కోసం విద్యాసంవత్సరం మధ్యలోనైనా 30 శాతం బదిలీలు చేసే అవకాశం ఉండటంతో కానిస్టేబుళ్లు దీనిపై నోరు మెదిపేందుకు సాహసించడం లేదు.
కానిస్టేబుళ్ల బదిలీలకు రంగం సిద్ధం
Published Sun, Sep 28 2014 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement