రూ. 82 లక్షలు దోపిడీ చేసిన కానిస్టేబుళ్లు | Sakshi
Sakshi News home page

రూ. 82 లక్షలు దోపిడీ చేసిన కానిస్టేబుళ్లు

Published Fri, May 15 2015 3:56 AM

రూ. 82 లక్షలు దోపిడీ చేసిన కానిస్టేబుళ్లు - Sakshi

కావలి: బంగారు వ్యాపారులను బెదిరించి కానిస్టేబుళ్లు రూ. 82 లక్షలు దోపిడీ చేసిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. దోపిడీ జరిగిన కొన్ని గంట ల్లోనే నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ముగ్గు రు ప్రకాశం జిల్లా కానిస్టేబుళ్లని సమాచారం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని తుపాకీ చూపి బెదిరించారు. మీపై అనుమానంగా ఉందని చెప్పి పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకె ళ్లారు.
 
 అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్ద వ్యాపారులను వదిలేశారు. అక్కడ నుంచి నలుగురు వ్యక్తు లు వెళ్లిపోయారు. మోసం జరిగిందని తెలుసుకున్న బంగారు వ్యాపారులు కావలి పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులు ప్రయాణించిన అంబాసిడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తున్న వారిని సినీఫక్కీలో వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. స్టూవర్టుపురానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలకు చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement