CoronaVirus Positive Cases in AP: 31 New Cases Registered In Andhra Pradesh
Sakshi News home page

ఏపీలో కొత్తగా 31 కరోనా కేసులు

Published Sat, Apr 18 2020 5:02 PM

Coronavirus : 31 New Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 31 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 603కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కృష్ణాలో 18, కర్నూలు 5, నెల్లూరు 3, ప్రకాశం 2, తూర్పు గోదావరిలో 2, పశ్చిమ గోదావరిలో ఒక కేసు ఉన్నాయి. ఇప్పటి వరకు 42 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 16 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 545కు చేరింది. (చదవండి : వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు)

Advertisement
Advertisement