Corona Cases: ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు | 54 New Corona Positive Cases in AP - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..

Published Thu, May 28 2020 11:50 AM

Coronavirus Count Rises To 2841 In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 54 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టుగా తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,958 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 59 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 824 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి : భారత్‌లో కొత్తగా 6,566 కరోనా కేసులు)

Advertisement
Advertisement