సాక్షి, నెట్వర్క్ : ప్రార్థనల కోసం ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారెవరనే దానిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రం నుంచి చాలామంది ప్రార్థనల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అలాంటి వారు ఎంతమంది ఉంటారనేది అంచనాకు అందటం లేదు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచి తిరిగొచ్చాక వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారనే దానిపైనా దృష్టి సారించారు. ఇలాంటి వ్యక్తులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలటంతో ఆ రెండు జిల్లాల అధికారులు అప్రమత్తమై వారిని గుర్తించే పనిలో నిమగ్నమై ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు.
చీరాల ప్రాంతం నుంచే 280 మంది..
- ఢిల్లీ వెళ్లిన గుంటూరు వ్యక్తుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ కావడంతో.. వారితో తిరిగిన 128 మందిని, చీరాలకు చెందిన పాజిటివ్ వ్యక్తుల్ని కలిసిన సుమారు 35 మందిని ఇప్పటికే గుర్తించారు.
- మరోవైపు ఢిల్లీ వెళ్లిన వారి రైల్వే రిజర్వేషన్ వివరాలను బట్టి వారి చిరునామాలు వెతుకుతున్నారు.
- చీరాలకు చెందిన మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కాగా.. ఆయనతో కలిసి ఢిల్లీ ప్రార్థనలకు సుమారు 280 మంది వెళ్లినట్లు గుర్తించారు. వారిలో 200 మంది ఒంగోలు రైల్వేస్టేషన్లో దిగినట్లు గుర్తించి.. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
- ఆదివారం రాత్రి వరకు చీరాల పరిసర ప్రాంతాలతో పాటు కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, ఒంగోలు నగరంలో సుమారు 105 మందిని గుర్తించి.. కొందరిని హోం క్వారంటైన్, మరికొందరిని ఆస్పత్రి క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలించారు.
- గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన 15 మంది ఢిల్లీ వెళ్లి ఈ నెల 19న స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించారు.
- వీరిలో ఇద్దరు కారంపూడి వాసులు కాగా.. పట్టణంలోని తూర్పు బావి ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు.
- వీరిలో ఇద్దరు యువకులు ఇటీవల గుంటూరులో విందుకు హాజరై కరోనా బారినపడ్డారు. ఆ యువకుల కుటుంబ సభ్యులతోపాటు వారిని కలిసిన 32 మందిని అంబులెన్స్లలో కాటూరు వైద్యశాలకు తరలించారు.
- కనిగిరిలో కజికిస్తాన్ నుంచి వచ్చిన ఓ వైద్యుడు క్వారంటైన్లోకి వెళ్లకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నట్లు తేలడంతో అతనిపై కేసు నమోదు చేసి క్వారంటైన్కు తరలించారు.
- అతడి వద్ద వైద్యసేవలు పొందిన 150 మంది రోగులను సైతం గుర్తించి క్వారంటైన్కు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీ వెళ్లొచ్చిందెవరు?
Published Mon, Mar 30 2020 3:57 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
Advertisement