ఏపీలో మరో రెండు కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో రెండు కరోనా కేసులు

Published Fri, Mar 27 2020 9:32 PM

CoronaVirus: Two More Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 13కు చేరింది.  ఇటీవలే బర్మింగ్‌హామ్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన కుటుంబసభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఇక గుంటూరులో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 406 మంది కరోనా అనుమానితులుకు కరోనా పరీక్షలు నిర్వహించామని.. ఇందులో 317 మందికి కరోనా నెగటీవ్‌ వచ్చిందని.. 13 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయిందని అధికారులు తెలిపారు. మిగతావారికి సంబంధించిన రిపోర్ట్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.    

Advertisement
Advertisement