- సమావేశం కోసం వైఎస్సార్సీపీ పట్టు
- ససేమిరా అంటున్న అధికార పార్టీ
- కమిషనర్ మౌనముద్ర
- టీడీపీలో సర్దుబాట్ల కోసమేనా?
సాక్షి, నెల్లూరు : కార్పొరేషన్ నూతన పాలకవర్గం ఏర్పడినా ఇంత వరకూ సర్వసభ్య సమావేశం నిర్వహించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. సమావేశం నిర్వహించాలని వైఎస్సార్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్తో పాటు 13 మంది సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మేయర్ అజీజ్ను వ్యతిరేకిస్తున్న అధికారటీడీపీ సభ్యులు మద్దతు పలుకుతుండటం విశేషం. కార్పొరేషన్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ జాన్శ్యాంసన్పై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. అయినా కమిషనర్ శ్యాంసన్ తనకేమీ పట్టనట్టు మౌనం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఎలాగైనా సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ నెట్టుకురావాలని మేయర్ అబ్దుల్అజీజ్ ఆధ్వర్యంలో అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది. నిబంధనల మేరకు సెప్టెంబర్ 3 లోపు కార్పొరేషన్ సమావేశమై కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఆ తర్వాత మూడునెలల్లో జనరల్ బాడీ సమావేశం జరిగాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రతి పదిమందికి ఒకరు చొప్పున స్టాండింగ్ కమిటీ సభ్యులను సైతం ఎన్నుకోవాల్సి ఉంది.
ఏ ఒక్క సమావేశం నిర్వహించకపోవడంపై ఎన్నికైన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్కు సాధారణ ఎన్నికలు జరిగినా జనరల్ బాడీ సమావేశం జరగక పోవడంతో అభివృద్ధి పనులు జరిగే అవకాశం కూడా లేదని సభ్యులు వాదిస్తున్నారు. ఏదీ జరపనప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సమావేశాలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేయర్గా ఎన్నికైన అబ్దుల్అజీజ్ ఆ తర్వాత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మేయర్తో పాటు 12 మంది కార్పొరేటర్లు పార్టీ మారినా అధికార పార్టీ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు అజీజ్ ఏకపక్షంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
ఇది మరింత ముదిరి జిల్లా టీడీపీలో వర్గవిభేదాలకు దారితీసింది. దీని నుంచి బయటపడలేక అజీజ్ సతమతమవుతున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్తో కలిపి వైఎ్ససార్సీపీకి 13 మంది సభ్యులున్నారు. వీరికి అజీజ్ను వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యుల మద్దతు ఉంది. సమావేశం కోసం వారు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో సర్వసభ్య సమావేశం జరిగితే పరిస్థితి తమకు వ్యతిరేకంగా ఉంటుందని అధికార పార్టీకి చెందిన ఓ వర్గం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో తమవారికి నచ్చ చెప్పుకునేందుకు సమావేశం జరగకుండా వాయిదా వేసుకుం టూ వస్తున్నట్టు సమాచారం. మరోవైపు కార్పొరేషన్ సమావేశం నిర్వహించకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు చూసి ఆందోళనకు దిగాలని కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కౌన్సిల్ రగడ
Published Tue, Aug 26 2014 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement