ఫ్యాక్టరీలో అవినీతిపై మహా ధర్నా.. మానవహారం
వైఎస్సార్సీపీ పిలుపునకు అనూహ్య స్పందన.. సీపీఐ, కాంగ్రెస్ మద్దతు
ధర్నాను అడ్డుకోబోయిన పాడేరు ఏఎస్సీతోరైతుల వాగ్వాదం
విచారణకు అమర్, బూడి, ధర్మశ్రీ డిమాండ్
రిలే నిరశనలు ప్రారంభం
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని, రైతులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీ గేటు ఎదుట సోమవారం మహాధర్నా చేశారు. రిలేదీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు హాజరుకాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఫ్యాక్టరీ గేటు ఎదుట మానవహారం చేయడంతో ఇరు వైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన సజావుగా సాగుతున్న సమయంలో పాడేరు ఏఎస్పీ బాబూజీ ఆవేశంగా అక్కడకు వచ్చి మానవహారంలో ఉన్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏఎస్పీని చూసి అక్కడే ఉన్న చోడవరం సీఐ కిరణ్కుమార్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి రైతులను, నాయకులను పక్కకు తోసేసి ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. పోలీసుల దౌర్జానాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. రైతుల బాధలంటే పోలీసులకు అంత చులకనా అంటూ ఏఎస్పీని నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పోలీసు అధికారులతో మాట్లాడి ఆందోళన యథావిధిగా కొనసాగించారు. దీంతో ఏఎస్పీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
త్వరలో కలెక్టరేట్ ముట్టడి: అమర్నాథ్
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబులాగే ఆ పార్టీ నాయకులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గోవాడ, అనకాపల్లి చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో గోవాడ నుంచి అనకాపల్లి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ బినామీల పేరుతో పంచదారను అమ్మి రూ. 8కోట్లు అవినీతికి పాల్పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కేసు మాఫీచేసుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గరకి స్థానిక ఎమ్మెల్యే వెళ్లారు తప్ప విచారణ వేయమని చెప్పడానికి కాదని విమర్శించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గోవాడ అవినీతి అంతా చోడవరం ఎమ్మెల్యే అండతోనే జరిగిందని ఆరోపించారు.
టెండర్లు వేయకుండా కేంద్ర మంత్రి సుజనా చౌదరి బందువుకు లక్షకుపైగా క్వింటాళ్ల పంచదారను ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తక్షణం సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి పల్లి అప్పలరాజు, కాంగ్రెస్ నాయకుడు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటువద్ద సోమవారం చేపట్టిన రిలే నిరహారదీక్షలను అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ ప్రారంభించారు.
అట్టుడికిన గోవాడ
Published Mon, Sep 7 2015 11:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement