కుంభకోణాలే టీడీపీ అజెండా | Sakshi
Sakshi News home page

కుంభకోణాలే టీడీపీ అజెండా

Published Tue, May 16 2017 4:48 AM

Corruption Is TDP's Main Agenda

కోటబొమ్మాళి(టెక్కలి): టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుంభకోణాలే అజెండాగా పనిచేస్తోందని టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆరోపించారు. విశాఖ కేంద్రంగా జరిగిన హవాలాలో వడ్డి శ్రీనివాసరావు, వడ్డి మహేష్‌ ప్రధాన పాత్ర పోషించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కురుడు పంచాయతీ పరిధి రామయ్యపేట కొండ పోరంబోకు ప్రభుత్వ స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా పద్మప్రియ క్రషర్‌ యజమానులు భూఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు.

 వీరి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేసిన వారికి అధికారుల అండదండలు ఉన్నాయన్నారు. ఆక్రమణలు అడ్డుకున్న కురుడు గ్రామస్తులను పోలీస్‌లతో భయపెట్టిస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. ఆయనతో పాటు మండల కన్వీనర్‌ హేమసుందరరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ దుబ్బ వెంకటరావు, అన్నెపు రామారావు, పేడాడ వెంకటరావు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement