► దాతల టికెట్ల కుంభకోణంలో ఇంటి దొంగలెందరో?
► ఆర్జిత కార్యాలయం కేంద్రంగానే కుట్ర
► కొందరు సిబ్బంది చేతివాటం?
► తేల్చని టీటీడీ విజిలెన్స్
► గతంలో అభిషేకం టికెట్ల కుంభకోణం ఇక్కడే
టీటీడీ ఆర్జితం కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. గతంలో సంచలనం రేపిన అభిషేకం టికెట్ల కుంభకోణానికి ఈ కార్యాలయమే కేంద్రబిందువైంది. ఇప్పుడు నకిలీ వీఐపీ దర్శనం టికెట్ల వ్యవహారం కూడా ఇక్కడి నుంచే సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఇంటి దొంగల సహకారంతో బయటి దళారులు అక్రమంగా లక్షలాది రూపాయలు ఆర్జిçస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన వారి అండదండలతోనే ఇదంతా సాగుతున్నట్లు విచారణలో వెల్లడవడం గమనార్హం.
సాక్షి, తిరుమల: టీటీడీ దాతల నకిలీ పాస్బుక్ టికెట్ల కుంభకోణంలో ఇంటిదొంగల హస్తం ఉందని తెలుస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కేటాయించే ఆర్జిత కార్యాలయం పాత్రపై అనుమానాలున్నాయి. ఒకరిద్దరు సిబ్బంది కేంద్రంగానే ఈ కుట్ర జరిగినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఈ దిశగా టీటీడీ విజిలెన్స్, పోలీసు దర్యాప్తు సాగడం లేదనే తెలుస్తోంది.
పోలీస్ కస్టడీకి నిందితులు
టీటీడీ ట్రస్టులకు విరాళాలు సమర్పించిన దాతలకు ఇచ్చే వీఐపీ దర్శనంలో నకిలీ టికెట్ల కుంభకోణంలో ఇప్పటికే 14 మందిని పోలీసులు అరెస్ట్చేసిన విషయం తెలిసిందే. దాతలకు సంబంధించి నకిలీ పాసుపుస్తకాలు, టికెట్లు తయారు చేయడంలో ప్రధాన నిందితుడు కరణం వేణుగోపాల్తోపాటు ఎం.వెంకటరమణ, పార్థసారధి, నాగభూషణం, వీజీ నాయుడు, గణేష్, చలపతి, శ్రీనివాసులు, రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండోదశలో హైదరాబాద్కు చెందిన మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మూడో దశలో టీటీడీ సూపరింటెండెంట్ ధర్మయ్యను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత వారిని పోలీసు కస్టడీకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నారు.
ఇంటి దొంగల పాత్రపై ఆరోపణలు
దాతల టికెట్ల కుంభకోణంలో టీటీడీలోని కొందరు ఇంటిదొంగల చేతివాటంతోనే బయటి వ్యక్తులు అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇందులో టీటీడీ సూపరింటెండెంట్ ధర్మయ్యతోపాటు మరికొందరు ఉద్యోగుల హస్తం ఉన్నట్టు కేసు ప్రాథమిక విచారణలోనే పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. అయితే, ఈ కేసులో ఆర్జితం కార్యాలయం కేంద్రంగా పనిచేసే కొందరు అక్రమార్కుల చేతివాటం కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి.
ఈ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన కొందరి ప్రమేయం ఉందని పట్టుబడిన నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ కుంభకోణంలో మరికొందరు సూత్రధారులు, పాత్రధారులు దర్జాగా తిరుగుతుండ డంతో ఆ దిశగా విచారణ సాగుతున్నట్టు లేదంటున్నారు.
పట్టించుకోని టీటీడీ విజిలెన్స్?
దేవస్థానంలో అక్రమాలు జరక్కుండా చూసేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ఉంది. ఇందుకోసం సీవీఎస్వో నేతృత్వంలో అదనపు సీవీఎస్వో, వీఎస్వోలు, ఏవీఎస్వోలు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, ధార్మిక సంస్థలో జరుగుతున్న అక్రమాలపై ఈ విభాగం అంతగా దృష్టి సారిస్తున్నట్టు లేదనే విమర్శలున్నాయి. దాతల పేరుతో నకిలీ టికెట్లతో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నా ఏమాత్రం గుర్తించిన సందర్భం లేదు. ఇలా వందలాది పాసుబుక్లతో వేలాది టికెట్లను అక్రమార్కులు వాడేసుకున్నారు. దీంతో టీటీడీకి రూ.కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అయితే, ఈ కుంభకోణాన్ని గుర్తించడంలో టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్లక్ష్యం ప్రదర్శించింది.
‘ఆర్జితం’ కేంద్రంగానే అభిషేకం టికెట్ల కుంభకోణం
గతంలో అభిషేకం టికెట్ల కుంభకోణం ఆర్జితం కార్యాలయం కేంద్రంగానే వెలుగుచూసింది. అతిముఖ్యమైన అభిషేకం టికెట్లను ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటంతో అక్రమాలకు పాల్పడినట్టు టీటీడీ విజిలెన్స్ విభాగం, పోలీసులు గుర్తించారు.
అక్రమ ఆర్జితం
Published Fri, May 12 2017 3:52 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement