భైంసా/భైంసా రూరల్, న్యూస్లైన్ : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నా రు. భైంసా మార్కెట్కు ఉదయం తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు కూడా వ్యాపారులు, అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. అయినా కొనుగోళ్లు జరగలేదు.
బహిరంగ వేలం పాటలో..
భైంసా పట్టణంలో బుధవారం నుంచి అధికారికంగా బహిరంగ వేలం పాట ద్వారా పత్తి కొ నుగోళ్లు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు. ఇప్పటికే కలెక్టర్ అహ్మద్ బాబు వేలం పాటలు నిర్వహించే యార్డుల్లోనే పత్తి తూకం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకేంద్రంలో అదే విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకే కాటన్ యార్డుకు వచ్చిన జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు బహిరంగ వేలం పాటల్లో పాల్గొనక ముందే యార్డుల్లో తూకం వేస్తే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొనడంతో రైతులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొనుగోళ్లు చేయమని వ్యాపారులు ఉదయం 11.13 గంటలకు యార్డు నుంచి నిష్ర్కమించారు. 11.23 గంటలకు అధికారులు కూడా వెనక్కి వెళ్లారు. దీంతో యార్డుకు వచ్చిన రైతులు ఏఎంసీ చైర్మన్ విఠల్రెడ్డిని కలిసి కార్యాలయానికి వెళ్లారు.
రోడ్డుపై బైఠాయింపు
కార్యాలయంలో చర్చించినా ఫలితం కనిపించక పోవడంతో అందరూ భైంసా బస్టాండ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12.32 గంటలకు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రైతులతోపాటే విఠల్రెడ్డి, రైతు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం 1.03 గంటలకు పట్టణ సీఐ పురుషోత్తం విఠల్రెడ్డితోపాటు రాస్తారోకోలో బైఠాయించిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
ఆర్డీవో రాకతో..
ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ మధ్యాహ్నం 3.26 గంటలకు ఏఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెటింగ్ ఏడీఎం అజ్మీరరాజు, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్రెడ్డి సమస్యకు మార్గం చూపేందుకు పత్తి వ్యాపారులను, రైతులను, రైతు నాయకులను పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7.30 గంటల వరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు. సాయంత్రం 5.10 గంటలకు కలెక్టర్తో మాట్లాడేందుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్లో ఉండడంతో ఆయన మాట్లాడలేక పోయారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అనంతరం కలెక్టర్తో రాత్రి 7 గంటలకు మరో మారు ఫోన్లో సంభాషించారు. పరిస్థితి వివరించడంతో ఆదిలాబాద్కు రావాలని కలెక్టర్ సూచించారు. దీంతో పత్తి వ్యాపారులు, అధికారులు, ఎమ్మెల్యే చారి, చైర్మన్ విఠల్రెడ్డిలు 7.30 గంటలకు ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు.
తప్పని నిరీక్షణ
మొదటి రోజు పత్తి బండ్లతో వచ్చిన రైతులకు నిరీక్షణ తప్పలేదు. దశలవారీగా చర్చలు జరిగినా సఫలీకృతం కాకపోవడంతో బండ్లను రోడ్డుపైనే పెట్టారు. పత్తి బండ్లతో వచ్చిన 400లకుపైగా రైతులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఆటోవాలాలు రైతులతో వాగ్వాదానికి దిగి తాము చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రెండు రోజులకు పొడిగించుకున్నారు. దీంతో రైతులు కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానంతో రైతులే నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులతో చర్చించకుండానే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని యార్డుకు పిలిపించడం ఎంత వరకు సమంజసం అంటూ అధికారులను నిలదీశారు. చేసేదేమి లేక రైతులు బండ్లపైనే నిద్రించారు.
రాత్రి వరకు వాగ్వాదాలే...
రైతులకు, అధికారులకు, రైతు నాయకులకు, కమీషన్ ఏజెంట్లకు, పత్తి వ్యాపారులకు, అధికారులకు మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వాగ్వాదాలు కొనసాగుతూనే కనిపించాయి. యార్డుల్లో కొనుగోలు చేసినా తూకం ఫ్యాక్టరీల్లోనే వేస్తామని వ్యాపారులు తేల్చి చెప్పారు. యార్డుల్లో తూకం వేస్తే ఫ్యాక్టరీకి వచ్చే వరకు ఎవరు బాధ్యులుగా ఉంటారని సీజన్ పెరిగితే బండ్లు ఎక్కువగా వస్తే తూకం వేయడం సాధ్యం కాదని పత్తి వ్యాపారులు తమ వాదన వినిపించారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఆదిలాబాద్లో పాటిస్తున్న వ్యాపారులకు భైంసాలో పాటించడం ఎందుకు సాధ్యం కాదని రైతులు ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కావడం లేదంటూ రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పినా ఎన్ని చర్చలు జరిపినా చివరకు కొనుగోళ్లు మాత్రం జరగలేదు. ఎంతో ఆశతో పంట అమ్మకానికి వచ్చిన పత్తి రైతులకు రెండు రోజుల నిరీక్షణ తప్పలేదు.
పత్తి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు
Published Thu, Nov 7 2013 4:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement