రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Published Sat, Apr 9 2016 9:29 AM

couple dies in road accident in visakapatnam

విశాఖపట్నం: వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలోని రేగుపాలెం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన దక్షిణామూర్తి, అనసూయమ్మ దంపతులు కారులో విశాఖ వెళ్తుండగా.. రేగుపాలెం వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

దీంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement