ఇష్టం లేని పెళ్లితో పరారై వచ్చిన జంట
తిరుపతిలోని ఓ లాడ్జీలో బస
ఘటనకు ముందు తిరుమలకు వెళ్లివచ్చిన ప్రేమికులు
లాడ్జీలోనే ఇద్దరూ ఆత్మహత్య
తిరుపతి క్రైం: ఓ ప్రేమ జంట బలవన్మరణం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసి ప్రియురాలికి దూరం చే యడంతో ఆ యువకుడు మనస్తాపం చెందాడు. ప్రియురాలితో కలిసి తిరుపతికి వచ్చి ఇద్దరూ తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఈ ఘటన తిరుపతి నగరంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన దుర్గారావు(25) అలియాస్ పండు, నల్లజర్ల మండలం అనంతపల్లెకు చెందిన దేవిశ్రీ(23) ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడికి ఇష్టం లే కున్నా తల్లిదండ్రులు 8 నెలల క్రితం శిరీషా అనే అమ్మా యితో వివాహం చేశారు.
ఇది నచ్చని అతను నాలుగు రోజుల క్రితం తన ప్రియురాలితో కలిసి తిరుపతికి వచ్చారు. గోవిందరాజస్వామి గుడి సమీపంలో ఓ లాడ్జీలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. సాయంత్రం తిరుమల వెళ్లి గురువారం ఉదయం తిరిగి లాడ్జీకి చేరుకున్నారు. సాయంత్రం అద్దె గది ఖాళీ చేయాల్సి ఉండగా లాడ్జి మేనేజర్ ఫోన్ చేయగా పది నిమిషాల్లో రెడీ అయి వస్తామని చెప్పారు. పది నిమిషాల సమయంలో ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ మృత్యువాతపడ్డారు. చేతులు కోసుకుని దేవిశ్రీ ఫ్యాన్కు ఉరివేసుకోగా, దుర్గారావు బాత్రూమ్లో ఉరివేసుకున్నాడు. సంఘటనా స్థలంలో పండూ ఐ లవ్యూ.. పండూ ఐలవ్యూ అంటూ 124 పేజీల నోట్బుక్ దొరికింది. చచ్చినా, బతికినా నీతోనే అని, మరొకరితో పెళ్లి అయినా నేను నీదానినే అని దేవిశ్రీ స్పష్టంగా అం దులో రాసివుంది.
లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే వారిద్దరూ రక్తపు మడుగులో పడిఉన్నారు. వారి సెల్ఫోన్లులో నంబర్ల ఆధారంగా బంధువులకు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా వివరాలు తెలిశాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు స్వగ్రామం నుంచి బయలుదేరినట్లు సమాచారం. కాగా దేవిశ్రీ కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 11న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రేమ జంట బలవన్మరణం
Published Fri, Mar 13 2015 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement