విశాఖ (లీగల్) : ముగ్గుర్ని హత్య చేసిన దంపతులకు యావజ్జీవ జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ నగరంలోని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి గుత్తుల గోపి శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు. కేసు వివరాలను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్మి సన్యాసిరావు ఇలా వివరించారు. నిందితులు యనమల చిన్నారావు, అతని భార్య చిన్న ఎలియాస్ రేఖ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన వారు.
మృతులు కివిటి లక్ష్మీనారాయణ , భార్య మహాలక్ష్మి వారి కుమార్తె ధన కూడా ఆ గ్రామస్తులే. లక్ష్మీనారాయణ మొదటి భార్య చనిపోవడంతో నేరం జరగటానికి పదిహేనేళ్ల ముందు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి సంతోష్, ధన సంతానం. మొదటి నిందితుడు చిన్నారావు లక్ష్మీనారాయణకు అల్లుడు. నిందితురాలు రేఖ మొదటి భార్య కుమార్తె. వీరందరూ హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఏడాది క్రితం లక్ష్మీనారాయణ మొదటి భార్య కుమారై బోడమ్మ భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందింది. పరిహారంగా రూ. 2లక్షలు వచ్చాయి.
అందులో రూ. 50 వేలు తనకు ఇవ్వాలని అతను కోరాడు. దీంతో కక్ష పెంచుకున్న చిన్నారావు, రేఖ ఎలాగైనా కుటుంబాన్ని అంతం చేయాలని పథకం సిద్ధం చేశారు. నేరం జరగడానికి మందు రోజు అందరూ సింహాచలం వచ్చారు. శ్రీకృష్ణా లాడ్జిలో బస చేశారు. 2010 జూన్ 5న ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి పథకం ప్రకారం అందరూ నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ, మహాలక్ష్మిని అతి కిరాతకంగా హత్య చేసి శవాలను మాయం చేశారు. మర్నాడు చిన్నారులు సంతోష్, ధన తమ తల్లిదండ్రులు ఏరీ అని అడగటంతో వారు మాకవరం వెళ్లినట్లు చెప్పారు.
అనంతరం పిల్లల్ని గాజువాక తీసుకు వెళ్లారు. అక్కడ ఇద్దర్ని హత్య చేసేందుకు యత్నించారు. ఈ పథకంలో సంతోష్ కొన ఊపిరితో బయటపడ్డాడు. ధన మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ కేసును గోపాలపట్నం పోలీసు ఇన్స్పెక్టర్ యు.రవి ప్రకాష్ దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో హత్యా నేరానికి యావజ్జీవం, హత్యాయత్నానికి ఏడేళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
దంపతులకు యావజ్జీవం
Published Sat, Feb 27 2016 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement