ప్రత్యేకత కలిగిన సమయంలో, మంచిదని తాము పరిగణించే ముహూర్తంలో తమ బిడ్డలు పుట్టాలన్న తాపత్రయంతో కొందరు తల్లిదండ్రులు ‘సిజేరియన్’ ఆపరేషన్ల ద్వారా కాలాన్ని గుప్పెట్లోకి తీసుకుంటున్న కాలమిది. అలాంటి వారి దారిలో తానూ నడవాలని మోజుపడ్డట్టు.. తూర్పుగోదావరి ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఓ ఆవు ప్రత్యేకత కలిగిన తేదీల్లోనే తన తొలి, మలి ఈతలను ఈనింది. యెరుబండి కనకదుర్గ సుబ్బరామారావు(రాంబాబు) ఇంట పెరిగిన ఆ ఆవు తొలిచూలులో 12.12.12 తేదీన పెయ్యదూడను ఈనింది. తిరిగి ఎదకు వచ్చిన ఆ ఆవు మలి చూలులో 11.12.13 తేదీన 11 గంటలకు పెయ్యదూడను ఈనింది. తన ఆవు ఇలా వరుసగా రెండు ఈతలనూ ప్రత్యేకత ఉన్న తేదీల్లో ఈనడంతో రాంబాబు మురిసిపోతున్నారు.
-న్యూస్లైన్, ఉప్పలగుప్తం