'బాబు, వెంకయ్య ప్రజలను మోసం చేస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'బాబు, వెంకయ్య ప్రజలను మోసం చేస్తున్నారు'

Published Mon, Feb 6 2017 12:00 PM

'బాబు, వెంకయ్య ప్రజలను మోసం చేస్తున్నారు' - Sakshi

ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏలూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర‍్గంలో ముస్లింలకు, గిరిజనులకు ప్రాతినిధ్యం లేదని మండిపడ్డారు.

కొడుకుకు మాత్రం మంత్రి పదవి కట్టబెడుతున్నారని ఆయన బాబుకు చురకలంటించారు. ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి విశాఖలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement