‘సాక్షి ప్రసారాల నిలిపివేత అనైతికం’ | Sakshi
Sakshi News home page

‘సాక్షి ప్రసారాల నిలిపివేత అనైతికం’

Published Mon, Jun 13 2016 2:03 PM

‘సాక్షి ప్రసారాల నిలిపివేత అనైతికం’ - Sakshi

నెల్లూరు: రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అనైతిక చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్రసారాల నిలిపివేతను అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించాలన్నారు.

‘సాక్షి’ గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని మధు డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement