సీపీఎం నేత వి.కృష్ణయ్య
సత్తెనపల్లి : ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్ష విధానాలే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య అన్నారు. శనివారం స్థానిక మెడికల్ అసోసియేషన్ హాలులో పుతుంబాక వెంకటపతి 22వ వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి కృష్ణయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
రోజురోజుకు ప్రజాసమస్యలు పెరుగుతున్నాయన్నారు. విధానాలపరంగా కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఒకేటనన్నారు. ఈ నేపథ్యంలో దేశప్రజలకు వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయాలన్నారు. వెంకటపతి స్ఫూర్తితో కార్యకర్తలంతా కంకణబద్ధులై ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మట్టి అమ్ముకుంటున్నారని విమర్శించారు.
ఈక్రమంలో పేదలను భూముల నుంచి తొలగిస్తున్నారని, ఇదే జరిగితే సీపీఎం చూస్తూ ఊరుకోదని, దీనిపై పోరాటం చేస్తుందన్నారు. రైతు రుణమాఫీపై వచ్చిన పిటిషన్లను వెంటనే పరిష్కరించి రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ జూన్ ఒకటిన చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలన్నారు.
సభకు సీపీఎం నాయకుడు ఎస్.ఆంజనేయనాయక్ అధ్యక్షత వహించారు.తొలుత పుతుంబాక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వెంకటపతి స్థూపం వద్ద గద్దె చలమయ్య పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. సీపీఎం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు అనంత పిచ్చయ్య, డివిజన్ కమిటీ సభ్యులు వంకాయలపాటి రాణి, గుంటుపల్లి బాలకృష్ణ, పి.సూర్యప్రకాష్రావు, గుంటూరు మల్లేశ్వరి, బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయం
Published Sun, May 31 2015 4:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement