గ్రామస్థాయి వీఆర్వో, ఏఈఓ, పంచాయతీ సెక్రటరీలతో టీమ్
కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రాంతాలుగా గుర్తించిన 12 మండలాల్లో శుక్రవారం నుంచి పంట నష్టంపై సర్వే మొదలు కానుంది. గ్రామస్థాయిలో వీఆర్ఓ, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ సెక్రటరీ సర్వే చేయనున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం ఆధారంగా 34 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఇందులో కల్లూరు, కోడుమూరు, ప్యాపిలి, వెల్దుర్తి, మంత్రాలయం, నందికొట్కూరు, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించింది.
జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో లేని గూడూరు, డోన్, కోసిగి, ఉయ్యాలవాడ మండలాలను కూడా ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించడం విశేషం. 12 మండలాల్లో ఈనెల 2 నుంచి సర్వే చేపట్టి 9వ తేదీకి పూర్తి చేస్తారు. తర్వాత గ్రామ పంచాయతీలో పెట్టి గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాత డేటా ఎంట్రీ చేసి ఈనెల 16వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి నివేదికలు వచ్చేలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వర్షాధారంపై సాగు చేసిన వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను గ్రామస్థాయిలో సర్వే చేసే టీమ్కు ఇవ్వాల్సి ఉంది. రెండు హెక్టార్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. 50 శాతం.. ఆపైన దెబ్బతిన్న పంటలను మాత్రమే నమోదు చేస్తారు. 2011, 2012 సంవత్సారాల్లో కరువు ఏర్పడినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లుగా జేడీఏ వివరించారు.
కరువు మండలాల్లో వర్షాభావం వల్ల పంటలను కోల్పోయిన రైతులు వెంటనే సంబంధిత గ్రామ కమిటీలకు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను అందజేయాలని తెలిపారు. జాబితాలను పంచాయతీలో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి.. పరిష్కరించిన తర్వాతే డేటా ఎంట్రీ మొదలవుతుందన్నారు. కాగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలోని 26 మండలాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటిని కూడా కరువు ప్రాంతాలుగా గుర్తించేలా జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
నేటి నుంచి కరువు మండలాల్లో పంట నష్టంపై సర్వే
Published Fri, Jan 2 2015 5:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement