► వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
► కలెక్టర్ లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : వినియోగదారులకు తమ హక్కులపై సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ పి. లక్ష్మీనరసింహం అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహార సురక్షిత అంశాలపై కల్తీ నిరోధక శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీరు, పాలు, కూరగాయలు తదితర అంశాల్లో కల్తీలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. మెడికల్ దుకాణాలలో వైద్యుని చీటీ మీద మాత్రమే మందులు విక్రయించాలని తెలిపారు. కల్తీలను పరిశీ లించే అధికారులు.. చక్కగా, సకాలంలో ఈ తనిఖీలు చేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడు తూ.. సినిమా థియేటర్లకు వెళ్లేటప్పుడు బయట తినుబండారాలను తీసుకువెళ్లవచ్చని, ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఉందన్నారు. వినియోగదారులు ఆలోచించడం మొదలు పెట్టాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కాల పట్టికలో సూచించిన మేరకు సేవలు అందకపోయినా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చని తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఎల్. శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. వినియోగదారుల ఫోరంలో సత్వర న్యాయం లభిస్తుందన్నారు. సామాన్య వినియోగదారులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. కలెక్ట ర్ కార్యాలయ న్యాయ సలహాదారు పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ వినియోగదారుల చట్టం చాలా ప్రయోజనకరమైనదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావు మాట్లాడుతూ వైద్య సేవలు పొందేవారూ వినియోగదారులేనని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు ధరల పట్టికను ప్రజలకు తెలిసే విధంగా ఉంచాలని చెప్పారు. జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు బగాది రామ్మోహనరావు మాట్లాడు తూ వినియోగదారుల ఉద్యమం బలోపేతం కావాలన్నారు.
అంతకుముందు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను, రైతు బజారులో ఏర్పాటు చేసిన రైపెనింగ్ చాంబర్ మోడల్ను, తూనికలు, కొలతల శాఖ, డ్రగ్స్ కంటోల్ శాఖ, గ్యాస్ కంపెనీల ప్రదర్శనలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్వీ జయరాం, ఫుడ్ సేఫ్టీ అధికారి జి. ప్రభాకరరావు, మార్కెటింగ్ సహాయ సంచాలకులు వైవీ శ్యామ్ప్రసాద్, సహాయ డ్రగ్ కంట్రోలర్ సీహెచ్ కిరణ్కుమార్, భారత్గ్యాస్ ప్రతినిధి ఆదినారాయణశాస్త్రి, హెచ్పీ గ్యాస్ ప్రతినిధి డి. శ్రీని వాసరావు పాల్గొన్నారు.
వినియోగదారులూ.. మేల్కోండి!
Published Thu, Mar 16 2017 3:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement