పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరీ ఆరోపించారు. శుక్రవారం విజయవాడ నగరంలో జరిగిన ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో పురందేశ్వరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురందేశ్వరీ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు బీజేపీ వల్లే మేలు జరిగిందన్నారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్నో విజ్ఞప్తి చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అయిన తమ విజ్ఞప్తులను అధిష్టానం పెడ చెవిన పెట్టిందని ఆరోపించారు.
బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదన్నారు. సీమాంధ్రకు మేలు జరిగిందంటే అది బీజేపీ పుణ్యమేనని పురందేశ్వరీ స్పష్టం చేశారు. ఆ సభకు హాజరైన బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ కూడా మాట్లాడారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి బీజేపీతోనే సాధ్యమైందని అన్నారు. విభజన సందర్బంగా బిల్లులో సీమాంధ్ర కోసం ఉద్దేశించిన ప్యాకేజీలు అమలు కావాలంటే బీజేపీ అధికారంలోని రావాలని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబుతోపాటు వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పోలవరానికి టీఆర్ఎస్సే అడ్డంకి
Published Fri, Mar 21 2014 2:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement