నెల్లూరు సిటీ,న్యూస్లైన్ : దాబాలు బార్లను తలపిస్తున్నాయి. హైవే వెంబడి ఉండే మద్యం దుకాణాల్లో మద్యం తాగడం నిషేధం. అయితే ఇం దుకు విరుద్ధంగా దుకాణదారులు ప్రత్యేకంగా గదులూ ఏర్పాటు చేసి మద్యం తాగడానికి అనుమతిస్తున్నారు. అర్ధరాత్రి అత్యవసర పని మీద రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తికి గుక్కెడు తాగునీరు,సేద తీరేందుకు కాసింత తేనీరు దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో మద్యం కావాల్సినంత దొరుకుతుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. ఏషియన్ హైవే వెంబడి ప్రతి ఏటా దాబాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
మద్యం మత్తులో ప్రమాదాలు..
దాబాల్లో మద్యం అందుబాటులో ఉండటంతో సమీప ప్రాంతాల మందుబాబులే కాకుండా వాహనచోదకులు విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారు. బాగా పొద్దుపోయే వరకు మద్యం తాగి ఇంటికి తిరిగి వెళ్లే సమయాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో గడచిన మూడేళ్లలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 520 మంది మృత్యువాత పడగా, 2 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మద్యం తాగి ప్రమాదాల బారిన పడిన వారేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మద్యం మత్తులో యువత ఘర్షణలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలున్నాయి. దాబాల నిర్వాహకులే ఇరు వర్గాలకు సర్ది చెప్పి రాజీ చేస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు అధిక శాతం పోలీసు రికార్డులకెక్కడం లేదు. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరిగాయి. రాత్రి 10 గంటలు దాటితే దుకాణాలు మూసివేయాలని హడావుడి చేసే పోలీసులు హైవే వెంబడి ఉండే మద్యం దుకాణాలు, దాబాలపై కనీసం కన్నెత్తైనా చూడడం లేదు. ఆ వ్యాపారులతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు హైవేపై దాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో పోలీసులు దాబాలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోవడం మానివేశారు. పోలీసుల హడావుడి తగ్గేంత వరకు దాబాల్లో మద్యం విక్రయాలకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా మళ్లీ మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి.
నిర్వాహకులపై చర్యలు నిల్
దాబాల్లో మద్యం విక్రయించకూడదు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వీరు దాబా ల వైపు దృష్టి సారించడం లేదు. అడపాదడపా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నా రు. దీంతో దాబాల నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎస్ రామకృష్ణ దాబాల్లో మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. లేదంటే మీపై చర్యలు తప్పవు అంటూ పదే పదే సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు రోజులు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనక మామూళ్ల మత్తేనన్న ఆరోపణలు ఉన్నాయి.
దాబారులు
Published Mon, Dec 9 2013 5:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
స్థిరంగా బంగారం, వెండి: ఈ రోజు కొత్త ధరలు ఇలా..
పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
బిగ్బాస్ విన్నర్ తేజస్వి బోల్డ్ లుక్స్ (ఫోటోలు)
ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement