జగనన్నను చూశాకే పనులకు వెళ్తాం.. | Sakshi
Sakshi News home page

జగనన్నను చూశాకే పనులకు వెళ్తాం..

Published Fri, Nov 17 2017 8:58 AM

daily workers waiting for YS jagan on road side - Sakshi

నంద్యాల టౌన్‌:  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నుంచి తమ గ్రామం పెద్ద చింతకుంటకు వస్తున్నారని తెలుసుకుని  వ్యవసాయ కూలీలు ఉదయం 8 గంటలకే రోడ్డుపైకి చేరుకున్నారు. పొలం యజమాని ఒత్తిడి చేస్తున్నా వారు అక్కడి నుంచి కదల్లేదు. ‘జగనన్నను చూశాకే వెళ్తాం. మరీ ఆలస్యమైతే సగం కూలీ ఇద్దురు గానీ’ అని అన్నారు. జగన్‌ ఉదయం 10 గంటలకు వారి వద్దకు వచ్చారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.  రంగమ్మ, ప్రభావతి అనే ఇద్దరు కూలీలను జగన్‌ దగ్గరకు పిలిచి, వారితో కలిసి మూడు నిమిషాలపాటు నడక సాగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement