కదిరి : ఎన్పీ కుంట మండలం ఎగువపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన బాంబు దాడి అంతా నాటకమని పోలీసులు తేల్చేశారు. దీంతో తన ఇంటిపై వైఎస్సార్సీపీ నాయకులు బాంబు దాడి చేశారని ఆరోపించిన టీడీపీ నాయకుడు భాస్కర్రెడ్డి... ఇప్పుడు పోలీసులకు ఫిర్యా దు చేయడానికి కూడా జంకుతున్నాడు. ‘మా గ్రామానికే చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి, రామసుబ్బారెడ్డి, గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డిలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి నన్ను వెంటాడారు. ఇది తెలిసి నేను బయటకు రాకుండా ఇం ట్లోనే దాక్కున్నాను. ఒరేయ్..నువ్వు బయటకు రాకపోతే నిన్ను ఇంట్లోనే బాంబులు వేసి చంపుతామని బయటనుంచి గట్టిగా అరిచారు.
అర్ధరాత్రి సమయంలో మేమంతా నిద్రపోతుంటే మా ఇంటిపై వారు నలుగురు బాంబులు వేసి నన్ను చంపాలని చూశారు. అదిగో గోడపై బాంబులు పడిన ఆనవాళ్లు’ అంటూ ఈ నెల 2 న పోలీసులకు కట్టుకథ చెప్పిన టీడీపీ నాయకుడు భాస్కర్రెడ్డి... ఒక్కసారిగా ఇప్పుడు తోక ముడిచాడు. తాను చేసిందంతా నాటకమని పోలీసులకు తెలిసిపోయిందని గ్ర హించి, తాను ఆరోపణలు చేసిన వారినే ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు. బాంబు దాడిపై కదిరి డీఎస్పీ దేవదానం, రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎన్పీ కుంట ఎస్ఐ వెంకటేశ్వర్లు సమగ్ర దర్యాప్తు చేసి అంతా నాటకమని తేల్చారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు దీన్ని మరింత సీరియస్గా తీసుకుని ఇంటెలిజెన్స్ డీఎస్పీ కోలార్ కృష్ణ నేతృత్వంలో పోలీస్ నిఘా బృందాన్ని పంపి నివేదిక తెప్పించుకున్నారు. రాజకీయంగా తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయించి వారిని జైళ్లో పెట్టించాలనేది ఆయన భావనగా ఆ బృందం తమ నివేదికలో ఎస్పీకి సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇంతకుమునుపు కూడా ఆయన వారిపై తప్పుడు కేసు పెట్టి పోలీసులనే మోసగించారని ఆ బృం దం తన నివేదికలో గుర్తు చేసినట్లు తెలిసింది. ఆయన ఇంటి గోడపైన, వసారాలోనూ డిటోనేటర్లు పేలిన గుర్తులను తెలియజేసే ఫొటోలను సైతం ఆ బృందం ఎస్పీకి సమర్పించింది. గతంలో తాను ఇచ్చిన కేసును లోక్ఆదాలత్ ద్వారా రాజీ చేసుకుంటానని, ఇప్పుడు బాంబు కేసులో రాజీకి రావాలని ఆ నలుగురి చెంతకు కొందరు టీడీపీ నాయకులను పంపారు. ఇది తెలిసిన పోలీసులు సంఘటనను ఎన్పీకుంట పోలీస్ స్టేషన్లో జీడీ(జనరల్ డైరీ)లో నమోదు చేసి అంతటితో ఆగిపోయారు. ఒకవేళ ఆయన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని తప్పుడు కేసని దర్యాప్తులో తేలితే అతనిపైనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్లో కూడా ఆయన చేసే ప్రతి ఫిర్యాదును అనుమానించాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది
Published Sun, Oct 5 2014 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement