కుల ఆధిపత్యం పుడితే.. మరో ఉద్యమం | Sakshi
Sakshi News home page

కుల ఆధిపత్యం పుడితే.. మరో ఉద్యమం

Published Thu, Jan 9 2014 7:49 PM

కుల ఆధిపత్యం పుడితే.. మరో ఉద్యమం - Sakshi

హైదరాబాద్: రానున్న తెలంగాణ రాష్ట్రంలో కుల ఆధిపత్యం పుడితే..మరో ఉద్యమం తలెత్తుతుందని డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరలోనే జరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరబోతుందని దామోదర తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుల ఆధిపత్యం పెరిగితే.. మరో ఉద్యమం తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకూ సీమాంధ్రుల పాలనలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయామని, నవ తెలంగాణ నిర్మాణం జరగడానికి ఎంతో సమయం లేదని తెలంగాణ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement